తాడిపత్రిలో భగ్గుమన్న పాతకక్షలు: ఒకరి మృతి, ముగ్గురికి సీరియస్

By narsimha lodeFirst Published Sep 21, 2018, 10:34 AM IST
Highlights

 అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని ఊరచింతలలో  రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలోవెంకటరమణ అనే ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడికక్కడే మరణించాడు

అనంతపురం: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని ఊరచింతలలో  రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలోవెంకటరమణ అనే ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడికక్కడే మరణించాడు.ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

తాడిపత్రి మండలంలోని ఊరచింతలలో రెండు వర్గాల మధ్య గొడవలు చోటుచేసుకొన్నాయి. పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం నాడు  ఉదయం గొడవలు చేసుకొన్నాయి. అయితే ఒకరిపై మరోకరు దాడికి పాల్పడ్డారు. ప్రత్యర్థులు జరిపిన దాడిలో  వెంకటరమణ  అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను  స్థానిక ఆసుపత్రికి తరలించారు.

click me!