ఒక్క మీటరు ఎత్తును తగ్గించం: పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో జగన్

Published : Dec 02, 2020, 04:59 PM IST
ఒక్క మీటరు ఎత్తును తగ్గించం: పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో జగన్

సారాంశం

పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించబోమని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

అమరావతి:పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించబోమని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ ప్రసంగించారు.  ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తామని ఆయన తేల్చి చెప్పారు.  ఎత్తు విషయంలో ఎలాంటి రాజీలేదన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అంచనాలు జల్ శక్తి అంచనాల ద్వారా కేంద్ర కేబినెట్ కే వస్తాయని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తోందని ఆయన చెప్పారు.

also read:ఎక్కడుంటే అక్కడ దిగజారిన రాజకీయం:చంద్రబాబుపై జగన్ ఘాటు వ్యాఖ్యలు

పోలవరం నిర్మాణంలో నిరాశ్రయులను ఆదుకోవడంతో పాటు పునరావాసం కల్పించే విషయమై చర్యలు తీసుకొంటామన్నారు. ఏ ఎత్తులో ప్రాజెక్టును నిర్మిస్తే ఎంత మేరకు పునరావసం, పరిహారం చెల్లింపు విషయమై ఖర్చుల గురించి తమ ప్రభుత్వం అంచనాలను తయారు చేసిందన్నారు. ఈ మేరకు ఏ ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే  ఏ మేరకు ఖర్చు అవుతోందనే విషయమై సీఎం లెక్కలతో సహా వివరించారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టును ప్రజలకు చూపించే పేరుతో రూ. 83.కోట్ల 45 లక్షలను వృధాగా ఖర్చు చేశారని ఆయన విమర్శించారు.

ప్రజలను పోలవరం వద్దకు తీసుకెళ్లి చంద్రబాబునాయుడు భజన చేయించారన్నారు. గతంలో పోలవరం వద్ద చంద్రబాబును పొగుడుతూ పాడిన ఓ పాట వీడియోను అసెంబ్లీలో జగన్ ప్రదర్శించారు.తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ఒక్క పైసా కూడ వృధా చేయదని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu