న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ఫలితాలు: వైసీపీదే విజయం

By Nagaraju penumalaFirst Published May 19, 2019, 6:55 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టం చేసింది. 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తోందని వెల్లడించింది. 
 

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టం చేసింది. 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తోందని వెల్లడించింది. 

అటు అధికార తెలుగుదేశం పార్టీ 10 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇకపోతే జనసేన పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందదని తెలిపింది. అయితే బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని తెలిపింది.

2019 ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలు:

వ.నం           పార్టీ పేరు                              గెలిచే స్థానాల సంఖ్య                పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం

1.               తెలుగుదేశం                                  10-12                                           0

2.               వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ                13-14                                           0

3.              జనసేన పార్టీ                                     0                                                0
4.              బీజేపీ                                                1                                               0
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి.

 

ఈ వార్తలు కూడా చదవండి

ఐఎన్ఎన్ఎస్ మీడియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు: టీడీపీకే పట్టం,బోణి కొట్టిన జనసేన

ఎలైట్ ఎగ్జిట్ పోల్ సర్వే: టీడీపీదే విజయం

టీడీపీకి 100 దాటనున్న అసెంబ్లీ స్థానాలు: లగడపాటి ఎగ్జిట్ పోల్‌

ఆరా ఎగ్జిట్ పోల్స్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం

click me!