ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని: రేపు ఎంపీటీసీ, జడ్‌పీటీసీ నోటిఫికేషన్

Siva Kodati |  
Published : Mar 31, 2021, 03:10 PM IST
ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని: రేపు ఎంపీటీసీ, జడ్‌పీటీసీ నోటిఫికేషన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 8న ఎన్నికలు, 10న కౌంటింగ్ జరిపే అవకాశం వుంది. మరోవైపు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 8న ఎన్నికలు, 10న కౌంటింగ్ జరిపే అవకాశం వుంది. మరోవైపు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు.

కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే ఆమె పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అవకాశం వుంది. 

ఐదేళ్ల పాటు పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ప్రభుత్వంతో పోరాడిమరీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. పదవీ కాలం ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎస్ఈసీగా తన పదవీకాలం పూర్తి సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించామని.. ఇందులో ప్రభుత్వం తోడ్పాటు మరువలేనిదన్నారు. ముఖ్యంగా కలెక్టర్లు, పోలీసులు, ఇతర సిబ్బంది సహకరించారని వివరించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే