ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకంపై హైకోర్టులో పిటిషన్

Published : May 22, 2021, 02:17 PM IST
ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకంపై హైకోర్టులో పిటిషన్

సారాంశం

ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ మీద హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వెకేషన్ తర్వాత విచారణ జరగనుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ)గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో నీలం సాహ్నిని నియమించారు. 

ఆ పిటిషన్ మీద హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సమ్మర్ వెకేషన్ తర్వాత ఆ పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేపట్టనుంది.

నీలం సాహ్ని తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆమెను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆమె ఆ పదవిలో కొనసాగుతున్న సమయంలోనే ఏపీ ఎస్ఈసీగా పదవీ విరమణ చేశారు. దాంతో ఆయన స్థానంలో ప్రభుత్వం ఆమెను ఏపీ ఎస్ఈసీగా నియమించింది.

ఆమె ఏపీఎస్ఈసీగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ఎన్నికల పోలింగ్ జరిగినప్పటికీ కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపును నిలిపేశారు. తాజాగా ఆ ఆ నోటిఫికేషన్ చెల్లదని, పరిషత్ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!