దళిత యువకుడిపై శిరోముండనం: విచారణకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశం

Published : Jul 26, 2020, 10:47 AM IST
దళిత యువకుడిపై శిరోముండనం: విచారణకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశం

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో శిరోముండనం చేసిన  ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణకు ఆదేశించింది. సీతానగరంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్న యువకుడు ప్రసాద్ పై దాడి చేసి శిరో ముండనం చేశారు


కాకినాడ:తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో శిరోముండనం చేసిన  ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణకు ఆదేశించింది. సీతానగరంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్న యువకుడు ప్రసాద్ పై దాడి చేసి శిరో ముండనం చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు లేఖ రాశాడు. 

ఈ లేఖపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల పేర్లు కూడ స్పష్టంగా తెలపాలని కోరింది కమిషన్. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు లేఖ రాసింది. 

దళితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. దళితులకు తమ పార్టీ అండగా ఉంటుంందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటనలో ఇప్పటికే ఎస్ఐ ను వీఆర్ కు పంపారు. ఇదే కేసులు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొన్నారు. ఈ ఘటనపై రాష్ట్రంలో దళిత సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!