మంత్రులపైనే అనుమానాలా

Published : Dec 15, 2016, 11:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
మంత్రులపైనే అనుమానాలా

సారాంశం

మంత్రుల్లో ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నయోమే

సొంత మంత్రులపైనే చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. ఈ రోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. హాజరైన మంత్రులందరి వద్ద నుండి వారి మొబైల్ ఫోన్లను సెక్యూరిటీ సిబ్బంది తీసేసుకున్నారు.

 

ఈ విధంగా గతంలో ఎన్నడూ జరగలేదు. మరి, ఇపుడే ఎందుకు జరిగిందంటే మంత్రుల్లో ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నయోమే అని అనుకుంటున్నారు.

 

క్యాబినెట సమావేశంలో జరిగే చర్చలను మంత్రులెవరైనా లైవ్ టెలికాస్ట్ చేస్తారని సిఎం అనుమానిస్తున్నారేమో తెలీదు. అందుకనే మంత్రుల సెల్ ఫోన్లను సమావేశ మందిరం బయటే తీసేసుకున్నారు.

 

దేశంలోని ఇంకే రాష్ట్రంలోనైనా ఈ విధానం ఉందా అని మంత్రులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి తన సహచరులపైన తనకేమాత్రం నమ్మకం లేదని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లైంది.

PREV
click me!

Recommended Stories

Nara Lokesh: ఏపీలో వరల్డ్ క్లాస్ బెస్ట్ ఎడ్యుకేషన్ అధికారులతో లోకేష్ కీలక సమావేశం | Asianet Telugu
పవన్, జగన్ కలుస్తారా ?? | YS Jagan | Pawan Kalyan | Nadendla Manohar | Asianet News Telugu