తెరపైకి చంద్రబాబు కుట్ర స్టోరీలు... విజయసాయి రెడ్డి మండిపాటు

Published : Aug 20, 2019, 11:23 AM IST
తెరపైకి చంద్రబాబు కుట్ర స్టోరీలు... విజయసాయి రెడ్డి మండిపాటు

సారాంశం

చంద్రబాబు తెరపైకి కుట్ర స్టోరీలు తీసుకువస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కృష్ణా నది కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఉందని... దానిని వెంటనే చంద్రబాబు ఖాళీ చేయాలని అధికార పార్టీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.  

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు తెరపైకి కుట్ర స్టోరీలు తీసుకువస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కృష్ణా నది కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఉందని... దానిని వెంటనే చంద్రబాబు ఖాళీ చేయాలని అధికార పార్టీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.

కాగా... కావాలనే ఎగువ నుంచి నీటిని వదిలి ఇళ్లు మునిగిపోవాలని అలా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్ణయిస్తారు. డ్యాం, బ్యారేజిల భద్రత వారికి ముఖ్యం. బ్యారేజి దిగువ ప్రజలు బలై పోయినా ఫర్వాలేదట. తన అక్రమ కొంప మునగటానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు గారు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Jobs Notification 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే రూ.49,000 శాలరీ గవర్నమెంట్ జాబ్
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో ఆగమాగం... ఇక్కడ ఏకంగా 46 మి.మీ వర్షమే..! ఇక అతలాకుతలమే