ప్రభుత్వంపై మోదుగుల సంచలన వ్యాఖ్యలు

Published : Jun 15, 2017, 09:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ప్రభుత్వంపై మోదుగుల సంచలన వ్యాఖ్యలు

సారాంశం

గుంటూరు జిల్లాలో రియల్టర్లు లక్షల ఎకరాల్లో లే-అవుట్లు వేసి రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుకు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో రియల్టర్లు లక్షల ఎకరాల్లో లే-అవుట్లు వేసి రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నకిలీ విత్తనాలకు గుంటూరు జిల్లా అడ్డాగా మారిందన్నారు. ఎరువుల మిక్సింగ్ ప్లాంట్లో కల్తీ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచారాల కోసమే సోదాలు చేస్తున్నట్లుగా ఉందని మోదుగుల మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Annadata Sukhibhava PM KISAN: రైతులకు స్పాట్ లోనే డబ్బులు | Asianet News Telugu
AP Food Commission Chairman: కచ్చితంగా ఫాలో అవ్వండి తప్పు చేయడానికి వీల్లేదు | Asianet News Telugu