గెలిపిస్తే, కేంద్రమంత్రిని చేసే స్థాయి సోమువీర్రాజుకు ఉందా? : భూమన

Published : Apr 06, 2021, 03:39 PM IST
గెలిపిస్తే, కేంద్రమంత్రిని చేసే స్థాయి సోమువీర్రాజుకు ఉందా? : భూమన

సారాంశం

తిరుపతిలో వైఎస్సార్సిపి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎంపీ మిథున్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థి డా. గురుమూర్తి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. 

తిరుపతిలో వైఎస్సార్సిపి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎంపీ మిథున్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థి డా. గురుమూర్తి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. 

వెంకన్న పాదాల సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని.. పచ్చి ద్రోహం చేసిన వారికి ఓటు ఎందుకు వేయాలి అని బీజేపీని ఉద్దేశించి..  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు.

రత్నప్రభను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజుకు ఉందా? అని ప్రశ్నించారు.టీడీపీ గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామనడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు 

పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు బాబు, లోకేష్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ఓటమి భయంతో ఎన్నికలు నిలిపివేయాలని బిజెపి ప్రయత్నిస్తోందని నిప్పులు చెరిగారు.

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu