జగన్ సాధించింది అదే.. మంత్రి యనమల

Published : Jan 23, 2019, 12:36 PM ISTUpdated : Jan 23, 2019, 04:54 PM IST
జగన్ సాధించింది అదే.. మంత్రి యనమల

సారాంశం

జగన్ చేసిన నేరాలను కాపీ కొట్టడం ఎవరివల్లా కాదని మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. 

జగన్ చేసిన నేరాలను కాపీ కొట్టడం ఎవరివల్లా కాదని మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో రూపొందించిన నవరత్నాలను టీడీపీ కాపీ కొడుతోందంటూ.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. వైసీపీ నేతల ఆరోపణలపై మంత్రి యనమల స్పందించారు.

నవరత్నాలను కాపీ కొడుతున్నారంటూ.. వైసీపీ నేతలు ఆరోపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణాలే జగన్ నవరత్నాలని ఆయన ఎద్దేవా చేశారు.  జగన్ చేసిన నేరాలను కాపీ కొట్టడం ఎవ్వరి వల్లా కాదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ కుంభకోణాలకు అంతేలేదన్నారు. రూ.లక్ష కోట్లు, 13 ఛార్జిషీట్లు, 16 నెలల జైలు.. ఇవే జగన్ రికార్డులని, ఇవి తప్ప జగన్ సాధించింది ఏముందని మంత్రి యనమల ప్రశ్నించారు. సమాజానికి చెడు జరగాలని కోరుకునే పార్టీ వైసీపీ అని, అన్నివర్గాల ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని యనమల రామకృష్ణుడు అన్నారు.

PREV
click me!

Recommended Stories

పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu
300 ఎక‌రాల్లో, రూ. 8,175 కోట్ల పెట్టుబ‌డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ గ్రామం రూపు రేఖ‌లు మార‌డం ఖాయం