ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయం తీసుకోం: ఆస్తి పన్ను పెంపుపై బొత్స క్లారిటీ

Siva Kodati |  
Published : Mar 04, 2021, 04:46 PM IST
ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయం తీసుకోం: ఆస్తి పన్ను పెంపుపై బొత్స క్లారిటీ

సారాంశం

వైఎస్ జగన్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాడేపల్లిలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 2,794 వార్డులకు గాను 571 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవమైనట్లు వెల్లడించింది.

వైఎస్ జగన్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాడేపల్లిలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 2,794 వార్డులకు గాను 571 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవమైనట్లు వెల్లడించింది.

ఏకగ్రీవాల్లో 98 శాతం వైసీపీవేనని తెలిపింది. ఏపీలో ఆస్తి పన్ను పెంచుతారని టీడీపీ ప్రచారం చేస్తోందని... ప్రజలకు ఇబ్బంది కలిగే ఎలాంటి నిర్ణయాన్ని వైసీపీ సర్కార్ తీసుకోలేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని బొత్స వెల్లడించారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని సత్యనారాయణ తెలిపారు.

చిన్నా, పెద్దా లేకుండా లోకేశ్ అహంకారంతో మాట్లాడుతున్నారని.. ఆస్తి పన్ను పెంచుతున్నట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?