గుంటూరు జిల్లాలో మరో జ్యోతి : తెనాలిలో యువతి గొంతు కోసిన యువకుడు

Siva Kodati |  
Published : Feb 21, 2019, 03:45 PM IST
గుంటూరు జిల్లాలో మరో జ్యోతి : తెనాలిలో యువతి గొంతు కోసిన యువకుడు

సారాంశం

కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో సంచలనం కలిగించిన జ్యోతి కేసు గురించి తెలిసిందే. ప్రేమ పేరుతో ఆమెను లోబరుచుకున్న శ్రీనివాస్ అనే యువకుడు... తీరా జ్యోతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ప్రాణం తీసినట్లు పోలీసులు నిర్ధారించారు.

కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో సంచలనం కలిగించిన జ్యోతి కేసు గురించి తెలిసిందే. ప్రేమ పేరుతో ఆమెను లోబరుచుకున్న శ్రీనివాస్ అనే యువకుడు... తీరా జ్యోతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ప్రాణం తీసినట్లు పోలీసులు నిర్ధారించారు.

ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసి.. కేసు తన మెడకు చుట్టుకోకుండా దానిని దుండగుల మీదకు తోచేశాడు. తాజాగా అదే గుంటూరు జిల్లాలో మరో జ్యోతి ఉదంతం వెలుగులోకి వచ్చింది.

తెనాలిలో ఇస్లాంపేటకు చెందిన జ్యోతి అనే యువతిని సత్యనారాయణ అనే యువకుడు నడిరోడ్డుపై గొంతు కోశాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు సత్యనారాయణ కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu