కాకినాడ జిల్లా: శివాలయ పున: ప్రతిష్టాపనలో అపశృతి.. భక్తులపై పడ్డ ధ్వజస్తంభం, పలువురికి గాయాలు

Siva Kodati |  
Published : Apr 15, 2022, 04:32 PM ISTUpdated : Apr 15, 2022, 04:33 PM IST
కాకినాడ జిల్లా: శివాలయ పున: ప్రతిష్టాపనలో అపశృతి.. భక్తులపై పడ్డ ధ్వజస్తంభం, పలువురికి గాయాలు

సారాంశం

కాకినాడ జిల్లాలో ఆలయ పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభం భక్తుల మీదకు పడటంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

కాకినాడ జిల్లాలో (kakinada district) ఓ పుణ్య కార్యంలో అపశృతి చోటు చేసుకుంది. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో మీనాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరుని (neelkantheshwara swamy temple) ఆలయ పున: ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అయితే స్వామి వారి పున: ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుండగా ధ్వజస్తంభాన్ని నిలబెడుతూ వున్నారు. అయితే ధ్వజస్తంభానికి ఓ వైపు కట్టి వున్న తాడు తెగిపోయింది. దీంతో స్తంభం ఒరిగిపోయి భక్తులపై పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో వారిని హుటాహుటిన యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్