సిగరెట్ తాగొద్దన్నందుకు వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించి హత్య..

Published : Jul 18, 2023, 12:20 PM IST
సిగరెట్ తాగొద్దన్నందుకు వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించి హత్య..

సారాంశం

సిగరెట్ తాగొద్దని వారించినందుకు ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించాడో వ్యక్తి. దీంతో అతను చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. 

సత్యసాయి జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సిగరెట్ తాగొద్దని వారించినందుకు ఓ యువకుడిపై హత్యయత్నం చేశాడో వ్యక్తి. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం శివరంలో ఈ దారుణం వెలుగు చూసింది. 

మహంతీష్ అనే వ్యక్తిని సిగరెట్ తాగొద్దని రంగనాథ్ అనే యువకుడు వారించాడు. దీంతో కోపానికివచ్చిన మహంతీష్ రంగనాథ్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్