సిగరెట్ తాగొద్దన్నందుకు వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించి హత్య..

Published : Jul 18, 2023, 12:20 PM IST
సిగరెట్ తాగొద్దన్నందుకు వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించి హత్య..

సారాంశం

సిగరెట్ తాగొద్దని వారించినందుకు ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించాడో వ్యక్తి. దీంతో అతను చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. 

సత్యసాయి జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సిగరెట్ తాగొద్దని వారించినందుకు ఓ యువకుడిపై హత్యయత్నం చేశాడో వ్యక్తి. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం శివరంలో ఈ దారుణం వెలుగు చూసింది. 

మహంతీష్ అనే వ్యక్తిని సిగరెట్ తాగొద్దని రంగనాథ్ అనే యువకుడు వారించాడు. దీంతో కోపానికివచ్చిన మహంతీష్ రంగనాథ్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

August Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్ట్ లో ఏకంగా 12 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకు?
Weather Update: ఉరుములు, ఈదురుగాలులతో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. IMD హెచ్చరిక