ఫ్రెండ్స్‌తో కుందేళ్ల వేటకు .. నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి

Siva Kodati |  
Published : Apr 06, 2022, 03:46 PM IST
ఫ్రెండ్స్‌తో కుందేళ్ల వేటకు .. నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి

సారాంశం

కుందేళ్ల వేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో తుపాకీ పేలి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఏలూరు జిల్లా తీగలపల్లెలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఇంటికి చేర్చి అతని మిత్రులు పారిపోయారు. 

ఏలూరు జిల్లాలో (eluru district) నాటు తుపాకీ పేలి ఒకరు చనిపోయారు. తీగలపల్లెకి చెందిన ముగ్గురు యువకులు రాత్రి తుపాకీతో కుందేళ్ల వేటకు వెళ్లారు. మట్టి రోడ్డులో వెళ్తూ వుండగా.. తుపాకీ కిందపడి పేలింది. ఈ క్రమంలో బుల్లెట్ కృష్ణ అనే వ్యక్తి తలలోకి దూసుకుపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఇంటి వద్దకు చేర్చిన మరో ఇద్దరు యువకులు పరారీలో వున్నారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇక‌పై గ్యాస్ సిలిండ‌ర్లు క‌నిపించ‌వా.? కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటోన్న ప్ర‌భుత్వం
Nara Lokesh Speech:చీటింగ్ లో వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు జగన్ పై లోకేష్ సెటైర్లు| Asianet News Telugu