పోలీసుల వేధింపులు.. యువకుడి ఆత్మహత్య, మృతదేహంతో పీఎస్ వద్ద బంధువుల ఆందోళన

Siva Kodati |  
Published : Aug 06, 2022, 03:56 PM IST
పోలీసుల వేధింపులు.. యువకుడి ఆత్మహత్య, మృతదేహంతో పీఎస్ వద్ద బంధువుల ఆందోళన

సారాంశం

కృష్ణా జిల్లా కంకిపాడులో యువకుడి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. అరవింద్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే పోలీసుల వేధింపులు, బాబాయ్ భార్య పెడుతోన్న ఇబ్బందుల వల్ల తాను చనిపోతున్నట్లు బాధితుడు సూసైడ్ నోట్‌లో రాశాడు.   

కృష్ణా జిల్లా కంకిపాడు పీఎస్ దగ్గర శనివారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.  అరవింద్ అనే యువకుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అరవింద్ మృతికి పోలీసులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపులు, బాబాయ్ భార్య పెడుతున్న ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అరవింద్ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. కోటి, మురళి అనే ఇద్దరు కానిస్టేబుల్స్ తనను వేధించారని సూసైడ్ నోట్‌లో రాశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అరవింద్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu