ఓ యువకుడు ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి ఓ యువతిని శారీరకంగా అనుభవించాడు. ఆ తీరా పెండ్లి చేసుకోమని అడిగితే.. దూరం పెట్టాడు. దీంతో ఆ యువతి ఆత్మాహత్య చేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడులో చోటు చేసుకుంది.
శారీరకంగా ఒక్కటైతే.. పెద్దలే వివాహం చేస్తారని నమ్మించి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన.. ఓ యువతి బలన్మరణానికి పాల్పడింది. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా నూజివీడులోని స్టేషన్తోటకు చెందిన రాణిమేకల రాణి(20) ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన కొండా ప్రదీప్కుమార్ అనే యువకుడు.. రాణి వెంట ప్రేమ పేరుతో ఆరు నెలలుగా వెంటడుతున్నాడు. ఆ యువతి కూడా ఆ యువకుడి ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ ఒక్కరిని ఒక్కరిని ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమ వ్యవహరం రెండు నెలల క్రితం వారి ఇళ్లల్లో తెలిసింది.. కానీ.. పెద్దలు వారి ప్రేమను అంగీకరించడం లేదు. దీంతో ఆ యువకుడు ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. మాట్లాడటం మానివేశాడు. ఈ నేపధ్యంలో ఆగస్టు మొదటి వారంలో ఆ యువకుడు.. ఆ యువతికి కలిసి మాట్లాడాడు. మనం ఇద్దరం శారీరకంగా కలిస్తే.. మన పెండ్లికి పెద్దలే సచ్చినట్టు ఒప్పుకుంటారని చెప్పి మాయ మాటలు చెప్పాడు. దీంతో ఆ యువతి.. 10వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువకుడిని పిలిచింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు.
మరుసటి రోజు నుంచి ఆ యువకుడు.. యువతితో మాట్లాడటం పూర్తిగా మానివేశాడు. యువతి భయంతో
జరిగిన విషయాన్ని గత వారం తన తల్లి మంజులకు చెప్పింది. ఆమె ఇరు కుటుంబ పెద్దలతో చెప్పగా.. వారు ఆ యువకుడిని నిలదీశారు. కానీ, యువకుడు, అతని తల్లి పెండ్లికి ఒప్పుకోలేదు. పైగా యువతిపై లేని నిందలు వేశారు. దీంతో ఆ యువతి 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ యువతిని స్థానిక ఆసుపత్రికి వెంటనే తరలించారు. కానీ ఆ యువతి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.