ప్రేమ జంట పరారీ: దళితులపై దాడి, తీవ్ర ఉద్రిక్తత (వీడియో)

Published : Aug 24, 2020, 01:06 PM ISTUpdated : Aug 24, 2020, 01:09 PM IST
ప్రేమ జంట పరారీ: దళితులపై దాడి, తీవ్ర ఉద్రిక్తత (వీడియో)

సారాంశం

ఓ ప్రేమ జంట వ్యవహారం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. దళిత వర్గానికి చెందిన యువకుడు అగ్రవర్ణానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు కూడా పారిపోయారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ ప్రేమ జంట వ్యవహారం గ్రామంలో ఘర్షణలకు దారి తీసింది. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామంలో వేర్వేరు కులాలకు చెందిన ప్రేమ జంట పరారైంది. దీంతో రెండు కులాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

ప్రేమికుల్లో యువకుడు దళిత సామాజికవర్గానికి చెందినవాడు. దాంతో దళితుల ఇళ్లపై అగ్రకులాలకు చెందినవారు దాడికి దిగారు. పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోన్ డీఎస్పీ నరసింహా రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 

"

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
చిన్నప్పుడు రాయల్ బైక్ ఎక్కేవాణ్ణి.. చంద్రబాబు పంచ్ లు | Chandrababu Review Meeting | Asianet Telugu