చావు దెబ్బతిన్నా బుద్దిరాలేదు: వైఎస్ జగన్ పై లోకేష్ ఫైర్

By Nagaraju penumalaFirst Published Feb 19, 2019, 8:11 PM IST
Highlights

ఒకప్పుడు తండ్రి శవాన్ని అడ్డంపెట్టుకొని సీఎం పీఠం ఎక్కాలి అనుకుని చావు దెబ్బతిన్నాడని అయినా జగన్‌కి బుద్ధి రాలేదని విమర్శించారు. కొండవీడులో రైతు కోటయ్య మృతికి సానుభూతి ప్రకటించకుండా వైసీపీ నీచ రాజకీయాలకు వాడుకుంటోందని ఎద్దేవా చేశారు. 


అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. కొండవీడులో రైతు ఆత్మహత్యపై వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని లోకేశ్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒకప్పుడు తండ్రి శవాన్ని అడ్డంపెట్టుకొని సీఎం పీఠం ఎక్కాలి అనుకుని చావు దెబ్బతిన్నాడని అయినా జగన్‌కి బుద్ధి రాలేదని విమర్శించారు. కొండవీడులో రైతు కోటయ్య వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. రైతు మృతికి సానుభూతి ప్రకటించకుండా వైసీపీ నీచ రాజకీయాలకు వాడుకుంటోందని ఎద్దేవా చేశారు. 

శవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ మోహన్ రెడ్డి గారు మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకుని చావు దెబ్బతిన్నా ఆయనకి బుద్ది రాలేదు.

— Lokesh Nara (@naralokesh)

 

శవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతు పొలానికి, సీఎం హెలిప్యాడ్‌కి సంబంధమే లేదని లోకేశ్ స్పష్టం చేశారు. వైసీపీ శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువైందని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ, కుల రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారని లోకేశ్ ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. 

రైతు పొలానికి, ముఖ్యమంత్రి హెలిప్యాడ్ కి సంబంధమే లేదు అన్న విషయం మీ దొంగ పత్రికకు తెలియదా? వైకాపా శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువయ్యింది. మీ శవ, కుల రాజకీయాలకు త్వరలోనే ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు pic.twitter.com/ISisDADEAN

— Lokesh Nara (@naralokesh)

 

మరోవైపు ఆత్మహత్య చేసుకున్న రైతును కాపాడేందుకు పోలీసులు ఎంతో శ్రమించారని స్పష్టం చేశారు. పోలీసులు కష్టాన్ని అభినందించాల్సిందిపోయి స్వార్థ రాజకీయం కోసం పోలీసులపై నిందలు వెయ్యడం అతని శవరాజకీయాలకు నిదర్శనమంటూ లోకేష్ ఆరోపించారు. రైతు కోటయ్యను పోలీసులు భుజాలపై ఎత్తుకుని పరుగున వెళ్తున్న వీడియోను అప్ లోడ్ చేసిన లోకేష్ ఈ వీడియో చూస్తే పోలీసులు పడ్డ శ్రమ తెలుస్తోందని అన్నారు. 
 

ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించిన రైతును కాపాడటానికి పోలీసులు ఎంత శ్రమించారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంత కష్టపడితే జగన్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసం పోలీసుల మీద నిందలు వేయడం అతని శవ రాజకీయాలకు నిదర్శనం pic.twitter.com/CGZrdqJRvi

— Lokesh Nara (@naralokesh)
click me!