ఎంపి నోరు కట్టేసిన లోకేష్

Published : Jun 13, 2017, 05:56 PM ISTUpdated : Mar 24, 2018, 12:17 PM IST
ఎంపి నోరు కట్టేసిన లోకేష్

సారాంశం

బహిరంగ ఆరోపణలతో పార్టీ, ప్రభుత్వ పరువు పోతోందట. అందుకనే ఎక్కడా మాట్లాడవద్దన్నారు.

బస్సుల వివాదంపై మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా ఆలస్యంగా స్పందించారు. రవాణాశాఖలోని ఉన్నతాధికారులు బాగా అవినీతిపరులంటూ విజయవాడ ఎంపి కేశినేని నాని సోమవారం చేసిన ఆరోపణలపై పార్టీ, ప్రభుత్వంలో అలజడి మొదలైంది. నాని ఆరోపణలపై రావాణాశాఖ సిబ్బంది మండిపడుతున్నారు.

ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై నాని చేసిన ఆరోపణలను ఈరోజు లోకేష్ ప్రస్తావించారు. ‘ఎవ్వరితోనూ మాట్లాడవద్దం’టూ ఆదేశించారు. బహిరంగ ఆరోపణలతో పార్టీ, ప్రభుత్వ పరువు పోతోందట. అందుకనే ఎక్కడా మాట్లాడవద్దన్నారు. పోర్చుగల్ పర్యటనలో ఉన్న మంత్రి కేశినేనితో మాట్లాడుతూ, తాను విజయవాడకు రాగానే కలిసి మాట్లాడుకుందామని చెప్పారు. అదే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలను నాని మంత్రికి వివరించారు. తామిద్దరు మాట్లాడుకున్న తర్వాత విషయాన్ని చంద్రబాబునాయుడుతో చర్చిద్దామని కూడా లోకేష్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

పత్తి పంటకి చీడ పడితే ఈ రైతు చేసేది విని సీఎం షాక్| CM Chandrababu Kuppam farmers interaction
CM Chandrababu: ప్రపంచంలోని టూరిస్ట్ లను మన ప్రకృతి సేద్యాన్ని చూడటానికి తీసుకొస్తా | Asianet Telugu