ఏలూరు జిల్లాలో పిడుగు పడి నలుగురు కూలీలు మృతి

Published : Aug 17, 2022, 09:10 AM IST
ఏలూరు జిల్లాలో పిడుగు పడి నలుగురు కూలీలు మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో పిడుగు పడి నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో పిడుగు పడి నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. బోగోలులో జామాయిల్ తోట నరికేందుకు దాదాపు 30 మంది కూలీలు వచ్చారు. జామాయిల్‌ కర్రలు తొలగిస్తుండగా కూలీలపై పిడుగు పడినట్లు సమాచారం. 

ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ఇక, మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ