తిరుమలలో కలకలం : ఐదేళ్ల బాలుడిపై దాడి, చిన్నారిని నోటకరచుకెళ్లిన చిరుత

By Siva KodatiFirst Published Jun 22, 2023, 9:52 PM IST
Highlights

తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసి, చిన్నారిని నోటకరచుకెళ్లింది. నడక మార్గంలో 7వ మైలు దగ్గర ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి బయల్దేరారు.

తిరుమలలో భయానక ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. నడక మార్గంలో 7వ మైలు దగ్గర ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత, చిన్నారిని ఎత్తుకెళ్లింది. అయితే పోలీసులు గట్టిగా అరవడంతో బాలుడిని చిరుత వదిలేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చిన్నారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి బయల్దేరారు. ఈ ఘటనతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

click me!