బెజవాడ పోలీసులకు చిక్కిన కిల్లర్స్ గ్యాంగ్: వెలుగులోకి విస్తుపోయే విషయాలు

By telugu teamFirst Published Jun 19, 2021, 9:15 AM IST
Highlights

వరుస హత్యలకు, చోరీలకు, చైన స్నాచింగులకు పాల్పడుతున్న ముఠాను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

విజయవాడ: ఓ హంతక ముఠాను విజయవాడ బోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస హత్యలకు, చోరీలకు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కారు. ప్రస్తుతం వారు విజయవాడ సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నారు. 

ఆ హంతక ముఠాకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ముఠా ఐదు హత్యలకు, 10 చైన్ స్నాచింగ్ లకు, ఐదు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా పెనమలూరు ఎటీఎంను చోరీ చేయడానికి ముఠా ప్రయత్నించారు. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. 

వారిని విచారించే క్రమంలో ఇతర నేరాలు కూడా బయటపడ్డాయి. పెనమలూరులో వృద్ధురాలిని హత్య చేసి ఆ ముఠా నగలతో ఉడాయించినట్లు తేలింది. కంచికచర్లలో కూడా ఓ వృద్ధ దంపతులను ఈ ముఠా హత్య చేసినట్లు గుర్తించారు. 

ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా ఎంచుకుని ఆ ముఠా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

click me!