చంద్రబాబు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. కన్నా

Published : Nov 02, 2018, 10:36 AM IST
చంద్రబాబు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. కన్నా

సారాంశం

ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ 1982లో  టీడీపీని స్థాపిస్తే... కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు 2018లో పార్టీని భూస్థాపితం చేశారని కన్నా విమర్శించారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పని వల్ల టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.

 

టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కన్నాలక్ష్మీనారాయణ శుక్రవారం ట్విట్టర్ వేధికగా స్పందించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ 1982లో  టీడీపీని స్థాపిస్తే... కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు 2018లో పార్టీని భూస్థాపితం చేశారని కన్నా విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడం చూసి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు.  1984లో చంద్రబాబును ఎందుకు పార్టీలో చేర్చుకున్నానా అని ఎన్టీఆర్‌ మదనపడుతూ ఉంటారని అన్నారు.

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: సామాన్యుడిలా రైతులతో కలిసి ప్రకృతి సేద్యాన్ని పరిశీలించిన సీఎం | Asianet News Telugu
CM Chandrababu Speech in Thadipatri: ఇలా చేయండి గ్యాస్ అవసరం లేదు చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్