చంద్రబాబు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. కన్నా

By ramya neerukondaFirst Published Nov 2, 2018, 10:36 AM IST
Highlights

ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ 1982లో  టీడీపీని స్థాపిస్తే... కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు 2018లో పార్టీని భూస్థాపితం చేశారని కన్నా విమర్శించారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పని వల్ల టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.

 

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ గారిచే
టీడీపీ స్థాపితం :1982

కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు గారిచే
టీడీపీ భూస్థాపితం:2018

— Kanna Lakshmi Narayana (@klnbjp)

టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కన్నాలక్ష్మీనారాయణ శుక్రవారం ట్విట్టర్ వేధికగా స్పందించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ 1982లో  టీడీపీని స్థాపిస్తే... కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు 2018లో పార్టీని భూస్థాపితం చేశారని కన్నా విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడం చూసి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు.  1984లో చంద్రబాబును ఎందుకు పార్టీలో చేర్చుకున్నానా అని ఎన్టీఆర్‌ మదనపడుతూ ఉంటారని అన్నారు.

The shameless joining of hands with by must be making NTR to cry in his grave for allowing CBN to join TDP in 1984.

— Kanna Lakshmi Narayana (@klnbjp)

 

click me!