రెండో రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి..

Published : Oct 08, 2022, 03:18 PM IST
రెండో రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి..

సారాంశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్ కేసు, రవాణా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ప్రభాకర్ రెడ్డి నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు శుక్రవారం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను విచారించిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా రెండో రోజు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యారు. 

స్క్రాప్‌ వాహనాల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్‌, నడపటం, కొన్ని చట్టాలను ఉల్లంఘించి విక్రయించడంపై ఈడీ అధికారులు ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2017 ఏప్రిల్ 1 తర్వాత బీఎస్ 3 వాహనాల అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. అనేక చట్టాలను ఉల్లంఘించి కొన్ని వాహనాలను విక్రయించారనే ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు.  

ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బీఎస్ 3 ప్రమాణాలు కలిగిన వాహనాలను అక్రమంగా బీఎస్ 4 వాహనాలుగా మార్చుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. ప్రభాకర్ రెడ్డి కంపెనీలకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతుంది. 

ఇదిలా ఉంటే.. శుక్రవారం విచారణ అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈడీ అధికారులు తనతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించారని చెప్పారు. తాను ఏజెన్సీ అధికారులకు సహకరించానని తెలిపారు. ఈడీ అధికారుల ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని చెప్పారు. తాను మనీ లాండరింగ్‌కు పాల్పడలేదని తెలిపారు. ఏపీ సీఐడీ అధికారులు ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. నేను క్లీన్‌గా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. నేను ఎలాంటి ఉల్లంఘన (నిబంధనల ఉల్లంఘన) చేయలేదని.. విచారణను ఎదుర్కొంటానని చెప్పారు.

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తనకు ఈడీ సమన్లు పంపిందనే వార్తలను ప్రభాకర్ రెడ్డి ఖండించారు. ఈడీ ముందు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని, దర్యాప్తులో ఏజెన్సీకి సహకరిస్తానని అన్నారు.

PREV
click me!

Recommended Stories

ప్రతీ బాధిత కుటుంబానికి కోటి ఇవ్వాలి జగన్ డిమాండ్| YS Jagan Visits Visakhapatnam to Console Families
మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వం ఉండేది ఇంకా మూడేళ్లే:జగన్ | YS Jagan Visits Visakhapatnam