ఆ పార్టీ నేత‌ల ఇండ్ల‌లో దోచుకోండి.. దాచుకోండి.. చెడ్డీ గ్యాంగ్‌కు జనసేన నేత సలహాలు

By Rajesh KFirst Published Dec 7, 2021, 5:19 PM IST
Highlights

Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ కి జనసేన నేత పోతిన మహేష్ స‌ల‌హా ఇచ్చారు. వారు ఎక్కడ దోపిడీ చేయాలో సలహా ఇచ్చి వార్తల్లో నిలిచారు. నగర శివారులో ఉండే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై దాడి చేసి దోచుకుంటే ఉపయోగం ఉండదని.. ఈ రాష్ట్రాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారుల ఇళ్లలో అన్నారు. వారి దగ్గర దోచుకుంటే వేల కోట్ల రూపాయల డబ్బులు దొరుకుతాయ‌ని స‌ల‌హా ఇచ్చారు.
 

Cheddi Gang: విజయవాడ జనసేన పార్టీ నేత పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసి వార్త‌ల్లో నిలిచారు. రాష్ట్రంలో సంచరిస్తున్న చెడ్డీ గ్యాంగ్‌కు స‌ల‌హాలు ఇచ్చారు. నగర శివారుల్లో ఉండే సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై దాడి చేసి దోచుకుంటే ఏం ఉపయోగం ఉండదనీ, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారుల ఇళ్లలో దోచుకోమ‌న్నారు. వారి ఇండ్ల‌లో దొంగ‌తనం  చేస్తే..  వేల కోట్ల రూపాయల దొరుకుతాయని స‌ల‌హా ఇచ్చారు.  వెళ్లి అలాంటి వారి ఇండ్లలో దోచుకోండి.. దాచుకోండి.. అంటూ సలహా ఇచ్చారు. నగర శివారుల్లో ఉండే సామాన్య‌, నిరుపేద కుటుంబాల‌పై దాడి చేయడం సమంజసం కాదన్నారు.

ఏపీలో పోలీసులు, డీజీపీ కూడా ఉద్యమకారుల మీద, ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిపై, రాజధాని కోసం ఉద్యమాలు చేస్తున్న రైతుల మీద అక్రమ కేసులు బనాయిస్తారని ఆరోపించారు. అలాగే.. ఎస్సీ, ఎస్టీల మీద తిరిగి అట్రాసిటీ  కేసులు  పెట్టి జైలుకు పంపుతారని ఆరోపించారు. కానీ ఏపీలో విగ్రహాలు కూల్చే వారి మీద, ప్రజల డబ్బును లూటీ చేసేవారి మీద గానీ, రథాలు తగలబెట్టేవారి మీద గానీ కేసులు పెట్టరని విమ‌ర్శించారు. చెడ్డీ గ్యాంగ్‌పై కూడా అంత పెద్ద కేసులు
పెట్ట‌క‌పోవ‌చ్చున‌ని భావిస్తున్న‌న్నారు. 

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/polavaram-project-sub-contractors-meets-sajjala-ramkrishna-reddy-r3qts3

అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వారి సలహాదారుల ఇళ్లలో దోచుకోవాలన్నారు. మ‌రీ ముఖ్యంగా మంత్రి వెల్లంపల్లి ఇంట్లో దోపిడీ చేస్తే.. వందల కోట్ల రూపాయలు దొరుకుతాయ‌నీ, అది కూడా రెండు వేల రూపాయల నోట్లు కట్టలకు కట్టలు దొరుకుతాయని స‌ల‌హా ఇచ్చారు. ఏపీలో గత కొద్దీ రోజులుగా చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. చీక‌టి ప‌డితే చాలు.. రాష్ట్రంలో ఏదొక చోట చెడ్డీ గ్యాంగ్ వీరంగం చేస్తోంది. మార‌ణాయుధాలతో సంచరిస్తూ..  అడ్డోస్తే  దాడులకు పాల్ప‌డుతున్నారు. వారి మాట విన‌క‌పోతే..  హతమారుస్తారు. ఇక వారికి ఆడ‌వాళ్లు క‌నిపిస్తే.. చాలు అత్యాచారాలకు పాల్ప‌డుతారు. ఇష్టానుసారంగా.. దోచుకొని అదే ఇంట్లోనే తాపీగా.. బోజ‌నం చేసి మ‌రి వెళ్తారు.

Read Also: https://telugu.asianetnews.com/video/andhra-pradesh/ap-governmentt-employees-wear-black-badges-to-work-in-protest-r3qmr4

నిన్న మొన్న‌టి దాక హైదరాబాద్‌లో హ‌ల్ చ‌ల్ చేసిన చెడ్డీ గ్యాంగ్ .. తాజాగా ఏపీని హ‌డ‌లెత్తిస్తోంది. వ‌ణుకు పుట్టించే అ క‌రుడుగ‌ట్టిన చెడ్డీ గ్యాంగ్ వ‌రుస‌గా ఏపీలో దొంగ‌తనాలు చేస్తోంది.  తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాలను ఈ గ్యాంగ్ దారుణాల‌కు పాల్ప‌డుతోంది. వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో దొంగతనాల‌కు పాల్పడింది. అక్క‌డి ప్రజలను భయాందోళన గురి చేస్తోంది.

శివారు ప్రాంతాల అపార్ట్‌మెంట్‌లే లక్ష్యంగా చెడ్డీగ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. విజయవాడ లో నగలు, నగదు దోపిడీ చేశారు. రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా తాడేపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కిలోమీటరు దూరంలో ఉన్న నవోదయ కాలనీలోని రెయిన్‌బో విల్లాల్లోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది.  టీటీడీ ఛైర్మన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసం ఉండే విల్లాలో చోరీ జరగడంతో కలకలం రేగుతోంది. 
 

click me!