రేపు విజయవాడకు పవన్ కళ్యాణ్

Published : Mar 09, 2021, 01:17 PM IST
రేపు విజయవాడకు పవన్ కళ్యాణ్

సారాంశం

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు విజయవాడకు రానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు విజయవాడకు రానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును విజయవాడలో నమోదు చేయించుకొన్నారు. గత ఎన్నికల్లో ఆయన విజయవాడలో ఓటు హక్కును వినియోగించుకొన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పవన్ కళ్యాణ్ రేపు విజయవాడకు వస్తారు.

విజయవాడలోని పటమటలంకలోని జిల్లా పరిషత్ స్కూల్లో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకొంటారు.మున్పిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో జనసేన మెరుగైన ఫలితాలను సాధించింది.

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో తాము సాధిస్తామని వైసీపీ ధీమాతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను బెదిరించి నామినేషన్లను ఉపసంహరింపజేశారని విపక్షాలు ఆరోపించాయి.ఈ విషయమై విపక్షాలు హైకోర్టులో పిటిషన్లు కూడ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Visakha Express Women Incident: కదులుతున్న రైలులో ఘోరం మహిళపై ఏసీ కోచ్‌ బాయ్.. | Asianet News Telugu
vidadala rajini: రెడ్ బుక్.. బ్లడ్ బుక్‌గా మారింది లోకేశ్ పై రెచ్చిపోయిన విడదల రజిని| Asianet Telugu