చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి రెండు పదవులు

Published : Jun 08, 2019, 12:20 PM IST
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి రెండు పదవులు

సారాంశం

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై సీఎం జగన్ రెండు పదవులు కేటాయించారు.  తిరుమల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా చెవిరెడ్డి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని నియమించారు.


వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై సీఎం జగన్ రెండు పదవులు కేటాయించారు.  తిరుమల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా చెవిరెడ్డి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని నియమించారు. ఇటీవలే ఆయనకు ప్రభుత్వ విప్ పదవిని కూడా అప్పగించారు. దీంతో.. ఆయనకు ఏపీ ప్రభుత్వం రెండు పదవులు కేటాయించినట్లుఅయ్యింది.

ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వైసీపీ చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించింది.13 అసెంబ్లీ సీట్లతోపాటు రెండు ఎంపీ సీట్లను పార్టీ కైవసం చేసుకుంది. కాగా ప్రాంతీయ సమతౌల్యం పాటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రివర్గ కూర్పులో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు శోభ‌నం గ‌దిలో కూర్చున్న‌ట్లు కూర్చోవ‌డం ఏంటీ మాస్టారు.? గ‌రిక‌పాటి వివాదం ఏంటి, ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారు.?
TTD కీల‌క నిర్ణ‌యం.. తిరుమ‌ల‌లో ఇ-టంగ్, ఇ-నోస్ టెక్నాల‌జీ. వీటి ఉప‌యోగం ఏంటంటే.?