ఎపిలో కొనసాగుతున్న ఐటి దాడులు: ఆగ్రహిస్తున్న టీడీపీ నేతలు

Published : Oct 06, 2018, 11:41 AM IST
ఎపిలో కొనసాగుతున్న ఐటి దాడులు: ఆగ్రహిస్తున్న టీడీపీ నేతలు

సారాంశం

విజయవాడ, నెల్లూరు, ప్రకాశం, హైదరాబాద్ ప్రాంతాల్లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. బీదం మస్తాన్ రావు కార్యాలయాల్లో మూడో రోజు శనివారం ఐటి సోదాలు జరుగుతున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ప్రారంభమైన ఐటి దాడులు శనివారంనాడు కూడా కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ శుభగృహ కార్యాలయంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

విజయవాడ, నెల్లూరు, ప్రకాశం, హైదరాబాద్ ప్రాంతాల్లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. బీదం మస్తాన్ రావు కార్యాలయాల్లో మూడో రోజు శనివారం ఐటి సోదాలు జరుగుతున్నాయి. కీలమైన డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్ ను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

తమ పార్టీ నేతలను లక్ష్యం చేసుకుని ఐటి దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నయని వారు విమర్శిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Rain Alert: వాయుగుండం ప్రభావంతో అల్లకల్లోలమే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
దండం పెడతా లైసెన్స్ తీసుకో తల్లీ: JC Prabhakar Reddy | Asianet News Telugu