నన్ను, నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు.. ఎవ్వరినీ వదలను : ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరిక

Siva Kodati |  
Published : Apr 22, 2022, 02:59 PM IST
నన్ను, నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు.. ఎవ్వరినీ వదలను : ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరిక

సారాంశం

తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఏం సాధించారని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.  ప్రభుత్వానికి, అధికారులకు రూల్స్ తెలియవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ విడిచిపెట్టేది లేదని ఏబీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. ఆరు నెలలకొకసారి సస్పెన్షన్‌ను పొడిగిస్తూ వచ్చారని ఏబీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సాక్ష్యాలు ఇచ్చానని.. తాను ఎవరినీ విడిచిపెట్టేది లేదని వెంకటేశ్వరరావు హెచ్చరించారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వదలనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, అధికారులకు రూల్స్ తెలియవా అంటూ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్ల కోసమే ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టిందని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.

కాగా... AB Venkateswara Rao సస్పెన్షన్ ను Supreme Court శుక్రవారం నాడు రద్దు చేసిన సంగతి తెలిసిందే. High Court ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏబీ వెంకటేశ్వరరావును మళ్లీ సర్వీసుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల రూల్స్ ప్రకారంగా సస్పెన్షన్ రెండేళ్లకు మించి ఉండకూడదని ఏబీ వెంకటేశ్వరరావు తరపున న్యాయవాది వాదించారు.  రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన SLPని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సస్పెన్షన్ రెండేళ్లు ముగిసనందున ఇకపై సస్పెన్షన్ అమల్లో ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది. 

నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును YS Jagan ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో Suspend చేసింది. Chandrababu Naidu  సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలను ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది. అంతేకాదు ఆయనను సస్పెండ్ చేసింది. 

తనపై విధించిన సస్పెన్షన్ ముగిసిందని ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 25న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా లేఖ రాశారు. 2021 జూలైలో తనపై విధించిన సస్పెన్షన్ ను చివరిసారిగా పొడిగించిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తనకు కూడా కాపీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎలా చూసినా కూడా తన సస్పెన్షన్ ముగిసిందని ఆయన తేల్చి చెప్పారు.

ఆయన ఈ లేఖ రాసిన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసెస్ అంశంపై చర్చ జరిగింది. ఈ విషయమై హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. 2019 మే వరకు పెగాసెస్ సహా ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనకు పీఎస్ సమీర్ శర్మ షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీనికి ఏబీ సమాధానమిచ్చారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకే తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినట్టుగా వివరణ ఇచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్