విమాన ప్రమాదం తప్పించుకున్న టిడిపి నేతలు

Published : Nov 15, 2017, 09:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
విమాన ప్రమాదం తప్పించుకున్న టిడిపి నేతలు

సారాంశం

ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిరిండియా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.

ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిరిండియా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ విమానంలో మంత్రి కళా వెంకట్రావు, ఎమ్మెల్యేలు గణబాబు, గౌతు శ్యామసుందర శివాజీ, వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ప్రభుత్వ వర్గాలు ఆందోళన మొదలైంది. విజయవాడ నుంచి విశాఖకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని ప్రయాణీకులెంతమంది అన్న విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. విమానం ల్యాండ్ అవ్వటానికి వాతావరణం అనుకూలించక, కొంత సాంకేతిక సమస్యకూడా తోడవ్వటంతో అర్ధగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ సమయంలో ఓ చక్రం పంక్చర్ కూడా అయ్యిందని సమాచారం. మొత్తానికి పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి సాహసం చేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu