తాను ప్రధానమంత్రి పదవికి పోటీలో లేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తన నిర్ణయంలో ఏనాడూ మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి: తాను ప్రధానమంత్రి పదవికి పోటీలో లేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తన నిర్ణయంలో ఏనాడూ మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి పదవికి చంద్రబాబునాయుడు సమర్ధుడని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బాబు స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత చర్చల ద్వారా ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకొంటామన్నారు.
విపక్ష పార్టీల్లో ప్రధానమంత్రి అభ్యర్ధి విషయమై మోడీ చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉందన్నారు.ఎన్నికలు అవగానే విపక్ష పార్టీలన్నీ సమావేశమై నిర్ణయం ప్రధాన మంత్రి ఎంపిక విషయమై నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు.