కాపు నేతలు ఎందుకు రాలేదో తెలియదు: గంటా

Published : Jun 26, 2019, 02:42 PM ISTUpdated : Jun 26, 2019, 02:48 PM IST
కాపు నేతలు ఎందుకు రాలేదో తెలియదు: గంటా

సారాంశం

కాపు నేతలు ఎందుకు చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన సమావేశానికి హాజరుకాలేదో  తనకు తెలియదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.

అమరావతి: కాపు నేతలు ఎందుకు చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన సమావేశానికి హాజరుకాలేదో  తనకు తెలియదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.

బుధవారం నాడు చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ నేతలు  సమావేశమయ్యారు.  ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.కాకినాడ మీటింగ్ వెళ్లిన వాళ్లలో కొందరు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. అందరికి  ఈ సమావేశానికి రావాలని ఆహ్వానాలు పంపలేదని ఆయన తెలిపారు. 

విజయవాడలో ఉండి కూడ కొందరు కాపు నేతలు  చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. ఈ విషయం తనకు తెలియదన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ విషయమై గురువారం నాడు ఏపీ డీజీపీని కలుస్తామన్నారు. 

ప్రజావేదికను కూల్చడాన్ని ఆయన తప్పుబట్టారు.  అర్ఝరాత్రి పూట ప్రజావేదికను కూలుస్తారా అని ఆయన ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu