అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

Published : Jan 17, 2019, 02:13 PM IST
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

సారాంశం

అనుమానంతో భార్యను సంక్రాంతి పండుగ రోజునే భర్త హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది.  ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.  

ఒంగోలు: అనుమానంతో భార్యను సంక్రాంతి పండుగ రోజునే భర్త హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది.  ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.   మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కంభం రోడ్డులో ఎన్. శరభయ్య తన భార్య పార్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు   ఇద్దరు పిల్లలున్నారు.  పార్వతి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో  టీచర్‌గా పనిచేస్తోంది. శరభయ్య  ముఠా కూలీగా పనిచేస్తున్నాడు. 

భార్య పార్వతిపై శరభయ్య అనుమానం పెంచుకొన్నాడు.ఈ విషయమై  ప్రతి రోజూ భార్య, భర్తల మధ్య గొడవలు సాగుతుండేవి.  ఈ కారణాన్ని సాకుగా చూపి శరభయ్య మద్యానికి బానిసగా మారాడు.   మద్యం తాగొచ్చి భార్యను వేధింపులకు గురి చేసేవాడు. 

అయితే ఈ విషయం తెలిసిన పార్వతి  తల్లిదండ్రులు శరభయ్యకు నచ్చజెప్పారు. అయితే ఈ నెల 16వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు  భార్య, భర్తల మధ్య మరోసారి గొడవ చోటు చేసుకొంది. ఈ గొడవ కారణంగా ఆగ్రహాంతో శరభయ్య భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు.

దీంతో పార్వతి అక్కడికక్కడే మరణించింది., ఈ విషయం తెలిసిన పార్వతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శరభయ్య కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

Job Calendar 2026 : ఏ నెల, ఏ తేదీ, ఏ శాఖలో, ఎన్ని ఉద్యోగాలు.. ప్లాన్ చేసుకుంటే ఓ జాబ్ మీదే
Machiraju Venugopal Rao Ugadi: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులవారికి జరిగేది ఇదే| Asianet News Telugu