ఎగువన భారీ వర్షాలు: నాగార్జున సాగర్‌‌లో పెరుగుతున్న ప్రవాహం, గేట్లు ఎత్తివేత

Siva Kodati |  
Published : Sep 19, 2020, 06:17 PM ISTUpdated : Sep 19, 2020, 06:23 PM IST
ఎగువన భారీ వర్షాలు: నాగార్జున సాగర్‌‌లో పెరుగుతున్న ప్రవాహం, గేట్లు ఎత్తివేత

సారాంశం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలోకి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో 20 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలోకి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో 20 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

ఇన్‌ఫ్లో 4 లక్షల 60 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3 లక్షల 77 వేల క్యూసెక్కులుగా వుంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం 589.80 అడుగులకు చేరింది.

ఓ వైపు జూరాల.. మరో వైపు తుంగభద్ర డ్యాం ల నుండి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం డ్యాం వద్ద గేట్లన్నీ ఎత్తివేశారు. మొత్తం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం డ్యాంకు జూరాల నుండి 1 లక్షా 93 వేల క్యూసెక్కులు… తుంగభద్ర నుండి 68 వేల క్యూసెక్కులు చొప్పున వరద పోటెత్తుతుండగా.. డ్యాం వద్ద 2 లక్షల 8 వేల క్యూసెక్కులు నమోదు అవుతోంది. దీంతో డ్యాం గేట్లన్నీ ఎత్తి విడుదల చేస్తుండడంతో దాదాపు 4 లక్షల క్యూసెకకుల భారీ వరద నాగార్జునసాగర్ కు ఉరకలెత్తుతోంది.

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami