తిరుమల శ్రీవారి సన్నిధిలో హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్..

By SumaBala BukkaFirst Published Feb 16, 2022, 10:56 AM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

తిరుమల : తిరుమల శ్రీవారిని Himachal Pradesh ముఖ్యమంత్రి Jai Ram Thakur దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఈ ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ కు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.

ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ ఛైర్మన్‌, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కలసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

click me!