పల్నాడులో హైటెన్షన్..టీడీపీ బాధితులతో సమావేశం

Published : Sep 07, 2019, 09:52 AM IST
పల్నాడులో హైటెన్షన్..టీడీపీ బాధితులతో సమావేశం

సారాంశం

చంద్రబాబు అధ్యక్షతన గుంటూరులో వైసీపీ బాధితుల సమావేశం చేపట్టారు. ఈ నేపథ్యంలో దానికి పోటీగా.. పల్నాడులో వైసీపీ నేతల ఆధ్వర్యంలో టీడీపీ బాధితుల సమావేశం చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి సుచరిత కూడా హాజరుకానున్నారు.

పల్నాడులో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ ఆధ్వర్యంలో పోటాపోటీగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో  పోలీసులు పల్నాడులో భారీగా మోహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగా... టీడీపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా... అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు టీడీపీ నేతలను ఇబ్బందులపాలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన గుంటూరులో వైసీపీ బాధితుల సమావేశం చేపట్టారు. ఈ నేపథ్యంలో దానికి పోటీగా.. పల్నాడులో వైసీపీ నేతల ఆధ్వర్యంలో టీడీపీ బాధితుల సమావేశం చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి సుచరిత కూడా హాజరుకానున్నారు.

ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా ముందుగా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. పోలీసులు భారీగా మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

రెడ్డప్పగారి మాధవి స్పీచ్ కి చంద్రబాబు లేచి మరీ చప్పట్లు Reddappagari Madhavi | Asianet News Telugu
మహానాడులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ |Nara Lokesh Powerful Speech | Asianet News Telugu