పరిటాల శ్రీరామ్ కి హైకోర్టు షాక్..

Published : Sep 06, 2018, 10:11 AM ISTUpdated : Sep 09, 2018, 02:09 PM IST
పరిటాల శ్రీరామ్ కి హైకోర్టు షాక్..

సారాంశం

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.  

ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  వైసీపీ నేత నారాయణపై పరిటాల శ్రీరామ్, అతని సన్నిహితులు గతంలో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా.. అతనిచేత బలవంతంగా తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుున్నారని బాధితుడు ఆరోపించారు.

తనపై దాడి చేశారని పరిటాల శ్రీరాం, ఇతర టీడీపీ నేతలపై నారాయణ లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదును పోలీసులు నిరాకరించారు. దీంతో నారాయణ పోస్టు ద్వారా తన ఫిర్యాదును జిల్లా ఎస్‌పీకి పంపారు. అయినా శ్రీరాంపై కేసు నమోదు చేయలేదు. దీంతో నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదుదారు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరాం తదితరులపై కేసు నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని అనంతపురం పోలీసులను ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Serious: మంత్రి కందుల దుర్గేష్ పై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: గోదావరి మధ్యన ఉన్న లాగూన్స్ కాలుష్య రీడింగ్ చూసి పవన్ షాక్ | Asianet Telugu