బ్రేకింగ్ న్యూస్ : స్పీకర్ కు కోర్టు నోటీసులు

Published : Apr 10, 2018, 02:05 PM IST
బ్రేకింగ్ న్యూస్ : స్పీకర్ కు కోర్టు నోటీసులు

సారాంశం

మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వేసిన కేసు ఆధారంగా కోర్టు స్పీకర్ కు మంగళవారం నోటీసులు జారీ చేసింది.

ఎంఎల్ఏల ఫిరాయింపులపై ఏపి అసెంబ్లీ స్పీకర్  కోడెల శివప్రసాద్ కు కోర్టు నోటీసులిచ్చింది. వైసిపి మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వేసిన కేసు ఆధారంగా కోర్టు స్పీకర్ కు మంగళవారం నోటీసులు జారీ చేసింది.

ఎంఎల్ఏల ఫిరాయింపులపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన స్పీకర్ చర్యలు తీసుకోలేదని ఆళ్ళ తన పిటీషన్లో పేర్కొన్నారు. పిటీషన్ ను పరిశీలించిన కోర్టు మూడు వారాల్లోగా  కౌంటర్ దాఖలు చేయాలంటూ స్పీకర్ కు నోటీసిచ్చింది.

ఇప్పటికే ఫిరాయింపు వ్యవహారాలపై అనేక కేసులు హై కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం