హీరా గ్రూప్ కుంభకోణం: రంగంలోకి హంతక ముఠా.. సాక్ష్యం చెబితే ఖతమే

sivanagaprasad kodati |  
Published : Jan 10, 2019, 12:39 PM IST
హీరా గ్రూప్ కుంభకోణం: రంగంలోకి హంతక ముఠా.. సాక్ష్యం చెబితే ఖతమే

సారాంశం

బంగారు ఆభరణాలు, వజ్రాల పథకాలతో దేశ విదేశాల్లో ప్రజల నుంచి రూ. వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన హీరో గ్రూప్ సంస్థ ఛైర్మన్‌ నౌహీరా షేక్‌పై విచారణ సాగుతున్న తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను ఆపేందుకు పెద్ద పెద్ద తలకాయలతో పాటు నౌహీరా అనుచరులు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

బంగారు ఆభరణాలు, వజ్రాల పథకాలతో దేశ విదేశాల్లో ప్రజల నుంచి రూ. వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన హీరో గ్రూప్ సంస్థ ఛైర్మన్‌ నౌహీరా షేక్‌పై విచారణ సాగుతున్న తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను ఆపేందుకు పెద్ద పెద్ద తలకాయలతో పాటు నౌహీరా అనుచరులు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ కేసు విచారణలో సాక్షులు, బాధితులను అంతమొందించడానికి ఓ కిరాయి హంతక ముఠా తెలుగురాష్ట్రాల్లో సంచరిస్తోందని తెలుస్తోంది. నౌహీరాపై ఫిర్యాదు చేసినా.. సాక్ష్యం చెప్పినా చంపేస్తామంటూ కొందరు సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారు.

సోషల్ మీడియా ద్వారా రివాల్వర్‌తో బాధితుల సెల్‌ఫోన్లకు ఫోన్లు వస్తున్నాయి. ఈ మేరకు కొందరు బాధితులు వీడియో ఫుటేజ్‌ను పోలీసులకు అందజేశారు. దీంతో హీరా కేసులో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే బాధితులు బెదిరిపోతున్నారు. హీరా గోల్డ్ కేసులో ఉగ్రవాదులు సైతం పెట్టుబడి పెట్టినట్లు సీబీసీఐడీ నిర్థారించిన సంగతి తెలిసిందే.    

PREV
click me!

Recommended Stories

బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu
Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?