ఏపీలో కుండపోత వర్షం... ప్రమాణస్వీకారానికి అడ్డంకి?

Published : Jun 08, 2019, 08:11 AM IST
ఏపీలో కుండపోత వర్షం... ప్రమాణస్వీకారానికి అడ్డంకి?

సారాంశం

ఏపీలో గత రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో ఏపీ సచివాలయ ప్రాంగణం మొత్తం చిత్తడిగా మారిపోయింది.

ఏపీలో గత రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో ఏపీ సచివాలయ ప్రాంగణం మొత్తం చిత్తడిగా మారిపోయింది. కాగా... ఈ రోజు ఏపీ నూతన మంత్రుల ప్రమాణస్వీకారం జరగనున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ వర్షం కారణంగా ప్రమాణస్వీకార మహోత్సవానికి అడ్డంకిగా మారనుందా అనే సందేహాలు మొదలౌతున్నాయి.

అయితే... ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రమాణస్వీకారం ఆగకూడదనే కారణంతో అధికారులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని తన నివాసం వద్ద నుంచి ప్రమాణస్వకార ప్రాంగణానికి బయలు దేరారు. 8గంటల 35 నిమిషాలకు ఆయన సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu