జీజీహెచ్ నుండి కరోనా రోగి అదృశ్యం: హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

Published : Jul 29, 2020, 01:01 PM IST
జీజీహెచ్ నుండి కరోనా రోగి అదృశ్యం: హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

సారాంశం

గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి నుండి కరోనా రోగి అదృశ్యమైన ఘటనపై  బుధవారం నాడు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను బుధవారం నాడు దాఖలైంది. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.


గుంటూరు: గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి నుండి కరోనా రోగి అదృశ్యమైన ఘటనపై  బుధవారం నాడు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను బుధవారం నాడు దాఖలైంది. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఈ నెల 14వ తేదీన కరోనా లక్షణాలు ఉన్న ఓ వ్యక్తి  తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అయితే తెనాలి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేని కారణంగా ఈ నెల 16వ తేదీన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయనను తరలించారు. 

అయితే అక్కడి నుండి ఆయన కన్పించకుండా పోయాడు. 12 రోజులుగా తన భర్త కన్పించడం లేదని భార్య ఆసుపత్రి చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోయింది. తన భర్త ఆచూకీని తెలపాలంటూ భార్య వెంకాయమ్మ కనపడిన వారిని ఆరా తీసింది. అయినా కూడ ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కూడ సరైన సమాధానం చెప్పలేదని ఆమె ఆరోపించింది.

దీంతో ఆమె తన భర్త ఆచూకీని తెలపాలని కోరుతూ ఇవాళ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

అచ్చెన్నాయుడు స్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా | Minister Atchannaidu Powerful Speech | Asianet Telugu
262 కోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి మత్స్య కారులకు సీఎం వరాల జల్లు | Asianet News Telugu