చిత్తూరు జిల్లా కుప్పంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని బాదూర్ హైస్కూల్లో నాటు తుపాకీతో ఈ కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి గోడలపై బుల్లెట్ గుర్తులు కనిపించాయి.
చిత్తూరు జిల్లా కుప్పంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని బాదూర్ హైస్కూల్లో నాటు తుపాకీతో ఈ కాల్పులు జరిగాయి. పాఠశాల గోడలు, తలుపులపై నాటు తుపాకీతో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం స్కూల్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.