నెల్లూరు ప్రమాద కుటుంబాలకు గవర్నర్ సంతాపం..

Published : Mar 23, 2021, 04:59 PM IST
నెల్లూరు ప్రమాద కుటుంబాలకు గవర్నర్ సంతాపం..

సారాంశం

నెల్లూరు జిల్లా సంగం మండలంలోని దువ్వురు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన పట్ల  ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్  హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

నెల్లూరు జిల్లా సంగం మండలంలోని దువ్వురు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన పట్ల  ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్  హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు . కార్మికులు ప్రయాణిస్తున్న ఆటోను అతివేగంగా ప్రయాణిస్తున్న పాల వాహనం  ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని గవర్నర్ కు నెల్లూరు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. 

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హరించందన్ అదేశించారు. 

మృతుల కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపిన గవర్నర్  ప్రమాద కారణంగా గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu