జెసికి సవాల్ విసిరిన గోరంట్ల మాధవ్ కు వైసిపిలో కీలక పదవి

Published : Feb 01, 2019, 06:32 AM IST
జెసికి సవాల్ విసిరిన గోరంట్ల మాధవ్ కు వైసిపిలో కీలక పదవి

సారాంశం

తన పోలీసాఫీసరు పదవికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. హిందూపురం ఎంపీ టికెట్ ఆశించి ఆయన వైసీపీ కండువా కప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

హైదరాబాద్: మాజీ సిఐ గోరంట్ల మాధవ్ కు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి అనంతపురం జిల్లాలో గోరంట్ల మాధవ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

తన పోలీసాఫీసరు పదవికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. హిందూపురం ఎంపీ టికెట్ ఆశించి ఆయన వైసీపీ కండువా కప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. గురువారం రాత్రి గోరంట్లకు వైసీపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. 

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా గోరంట్ల మాధవ్‌‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియమించారు. ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల, ఆయన అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.
 
పోలీసు అధికారిగా సిబ్బందిపై ఎంపీ జేసి చేసిన వ్యాఖ్య‌లపై మాధవ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అనంతరం తన సీఐ పదవికి రాజీనామా వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే