
విజయనగరం రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పార్కింగ్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయనగరం రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ ఘటనపై స్పందించిన రైల్వే అధికారులు, సిబ్బంది.. ట్రాక్ మరమతు పనులు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.