ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

narsimha lode   | Asianet News
Published : Dec 12, 2019, 10:38 AM IST
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

సారాంశం

ప్రకాశం జిల్లాలో గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 

ఒంగోలు: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం కొత్తపల్లిలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు.

కర్ణాటకకు చెందిన వారు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu