శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం: నలుగురు కానిస్టేబుళ్ల దుర్మరణం

Published : Aug 23, 2021, 02:07 PM IST
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం: నలుగురు కానిస్టేబుళ్ల దుర్మరణం

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్టుగా వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందారు.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు సాయుధ రిజర్వ్ పోలీసులు మరణించారు. నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగింది. 

ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్టుగా బొలెరో వాహనంలో వెళ్లి వస్తుండగా ఆ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది.

వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu