శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం: నలుగురు కానిస్టేబుళ్ల దుర్మరణం

Published : Aug 23, 2021, 02:07 PM IST
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం: నలుగురు కానిస్టేబుళ్ల దుర్మరణం

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్టుగా వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందారు.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు సాయుధ రిజర్వ్ పోలీసులు మరణించారు. నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగింది. 

ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్టుగా బొలెరో వాహనంలో వెళ్లి వస్తుండగా ఆ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది.

వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Bhogapuram Airport : ఆంధ్ర ప్రదేశ్ పై ప్రధాని వరాలు... కేంద్రం ఏమేం చేస్తుందో చెప్పిన నరేంద్ర మోదీ
Farmers Scheme : తెలుగు రైతులకు బంపర్ ఆఫర్.. అకౌంట్లోకి నేరుగా రూ.30,000, సర్కార్ సూపర్ స్కీమ్