శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి ప్రభుత్వ ఉద్యోగిపై నోరు పారేసుకొన్నారు. సరుబుజ్జిలి ఇన్ చార్జి ఈఓపీఆర్డీ గూనపు వెంకట అప్పలనాయుడికి ఫోన్ చేసి బూతులు తిట్టాడు. ఈ విషయమై తనకు రక్షణ కల్పించాలని ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ మరో ప్రభుత్వ ఉద్యోగిని దుర్బాషలాడాడు. ఈ విషయమై తనకు రక్షణ కల్పించాలని ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also read:''సొమ్ములు పోనాయి, నానేటి సేత్తాను''... జగన్ వెంటే ఆ మంత్రి కూడా జైలుకే: కూన రవికుమార్
ఆముదాలవల మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సరుబుజ్జిలి ఇన్ చార్జి ఈఓపీఆర్డీ గూనపు వెంకట అప్పలనాయుడికి ఫోన్ చేసి బూతులు తిట్టాడు. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రావి వలస పంచాయితీలో డబ్బుల విషయమై ఆయన సరుబుజ్జిలి ఇన్ చార్జి ఈఓపీఆర్డీకి ఫోన్ చేసి బూతులు తిట్టాడు. గతంలో కూడ సరుబుజ్జిలి ఎంపీడీఓను కూడ దూషించిన కేసులో రవికుమార్పై కేసు నమోదైంది,. ఈ కేసులో ఆయన బెయిల్పై ఉన్నాడు.
గతంలో కూడ పలువురు అధికారులతో ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే రవికుమార్ దూషణకు దిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ ఎ.దామోదరరావు, అప్పటి ఈఓపీఆర్డీ పీవీ మురళిమోహన్పై దూషణలకు దిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. .
‘ఆఫీసులోనే తులుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్వు ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా’ అంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించినట్టుగా ప్రచారంలో ఉంది. తాజాగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై కూన రవికుమార్ పై బాధితుడు ఫిర్యాదు చేశాడు.
ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ఈఓపీఆర్డీగా అప్పలనాయుడిని బండబూతులు తిట్టారు. భూమిలో పాతేస్తానంటూ అప్పలనాయుడిని బెదిరించాడు. మళ్లీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చి ఎత్తుకెళ్తానని బెదిరించాడు.