భూమిలో పాతరేస్తా: ఉద్యోగిపై మరోసారి టీడీపీ నేత తిట్ల దండకం

Published : Mar 02, 2020, 10:57 AM ISTUpdated : Mar 02, 2020, 02:40 PM IST
భూమిలో పాతరేస్తా: ఉద్యోగిపై మరోసారి టీడీపీ నేత తిట్ల దండకం

సారాంశం

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్  మరోసారి ప్రభుత్వ ఉద్యోగిపై నోరు పారేసుకొన్నారు. సరుబుజ్జిలి ఇన్‌ చార్జి ఈఓపీఆర్‌డీ గూనపు వెంకట అప్పలనాయుడికి ఫోన్‌ చేసి బూతులు తిట్టాడు.  ఈ విషయమై తనకు రక్షణ కల్పించాలని ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్  మరో ప్రభుత్వ ఉద్యోగిని దుర్బాషలాడాడు.  ఈ విషయమై తనకు రక్షణ కల్పించాలని ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:''సొమ్ములు పోనాయి, నానేటి సేత్తాను''... జగన్ వెంటే ఆ మంత్రి కూడా జైలుకే: కూన రవికుమార్

 ఆముదాలవల మాజీ ఎమ్మెల్యే  కూన రవికుమార్ సరుబుజ్జిలి ఇన్‌ చార్జి ఈఓపీఆర్‌డీ గూనపు వెంకట అప్పలనాయుడికి ఫోన్‌ చేసి బూతులు తిట్టాడు. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

రావి వలస పంచాయితీలో డబ్బుల విషయమై  ఆయన సరుబుజ్జిలి ఇన్‌ చార్జి ఈఓపీఆర్‌డీకి ఫోన్‌ చేసి బూతులు తిట్టాడు. గతంలో కూడ సరుబుజ్జిలి ఎంపీడీఓను కూడ దూషించిన కేసులో రవికుమార్‌పై కేసు నమోదైంది,. ఈ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నాడు. 

గతంలో కూడ పలువురు అధికారులతో ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే రవికుమార్ దూషణకు దిగినట్టుగా ఆరోపణలు  ఉన్నాయి. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ ఎ.దామోదరరావు, అప్పటి ఈఓపీఆర్‌డీ పీవీ మురళిమోహన్‌పై దూషణలకు దిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. .

‘ఆఫీసులోనే తులుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్వు ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా’ అంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరించినట్టుగా ప్రచారంలో ఉంది. తాజాగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై కూన రవికుమార్ పై బాధితుడు ఫిర్యాదు చేశాడు. 

ఫోన్‌ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని  ఈఓపీఆర్‌డీగా అప్పలనాయుడిని బండబూతులు తిట్టారు.  భూమిలో పాతేస్తానంటూ అప్పలనాయుడిని బెదిరించాడు. మళ్లీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే  ఇంటికి వచ్చి ఎత్తుకెళ్తానని బెదిరించాడు. 

 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu